కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 96.551 కేసులు, 1,209 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 96.551 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,209 మరణాలు సంభవించాయి.

కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 96.551 కేసులు, 1,209 మరణాలు..

Updated on: Sep 11, 2020 | 10:05 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 96.551 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,209 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,62,415కి చేరుకుంది. ఇందులో 9,43,480 యాక్టివ్ కేసులు ఉండగా..  76,271 మంది కరోనాతో మరణించారు. అటు 35,42,664 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో రోజుకు 5 వేలుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20.68 శాతం ఉండగా.. రికవరీ రేట్ 77.65శాతంలో.. డెత్ రేట్ 1.67 శాతంలో ఉంది.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

Loading...
Unable to load recommendations.
Follow Us