AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత నేవీలోకి మరో కలికితురాయి.. గోవా చేరుకున్న అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ యుద్ధ విమానం

భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు.

భారత నేవీలోకి మరో కలికితురాయి.. గోవా చేరుకున్న అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ యుద్ధ విమానం
Balaraju Goud
|

Updated on: Nov 19, 2020 | 8:28 PM

Share

భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు. సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడే అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానం భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరింది. అమెరికా రూపొందించిన ఈ విమానం బుధవారం గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్స నౌకా స్థావరంలో దిగింది.

అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రో ఆప్టిక్‌ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సాయంతో జలాంతర్గాముల ఆనుపానులు కనిపెట్టి, ఆయుధాలతో విరుచుకుపడటం దీని ప్రత్యేకత. 907 కి.మీ గరిష్ఠ వేగంతో, 1,200 నాటికల్‌ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో, ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యంతో ఈ విమానాలు నౌకా దళానికి కీలకంగా మారాయి అగ్రరాజ్యం అందించనున్న నాలుగు పీ8ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. ఈ నాలుగు విమానాల తయారీకి సంబంధించి 2016 జులైలో అమెరికాతో 1.1 బిలియన్‌ డాలర్లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన మూడు పీ8ఐ విమానాలు వచ్చే ఏడాదికల్లా సిద్ధమవుతాయని రక్షణవర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే భారత్‌ వద్ద 8 పీ8ఐ విమానాలు అందుబాటులో ఉన్నాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడాఖ్‌ ప్రాంతంలో గస్తీ కోసమూ వీటిని ప్రస్తుతం వినియోగిస్తోంది నేవీ ఫోర్స్. అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో భారత రక్షణ రంగం మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?