నిలకడైన ఆటతీరును కనబరుస్తున్న టీమిండియా.. 40 ఓవర్లకు 94/3.. క్రీజులో రహానె, విహారి..

India Vs Australia 2020: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా నిలకడైన ఆటతీరును కనబరుస్తోంది. 36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో..

నిలకడైన ఆటతీరును కనబరుస్తున్న టీమిండియా.. 40 ఓవర్లకు 94/3.. క్రీజులో రహానె, విహారి..

Updated on: Dec 27, 2020 | 7:57 AM

India Vs Australia 2020: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా నిలకడైన ఆటతీరును కనబరుస్తోంది. 36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాను ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ దెబ్బ తీశాడు. టెస్టుల్లో తొలి అర్ధ శాతానికి చేరువైన శుభ్‌మన్‌ గిల్‌(45; 65 బంతుల్లో 8×4)తో పాటు పుజారా‌(17; 70 బంతుల్లో 1×4)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. దీనితో టీమిండియా 64 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ అజింక్య రహానె(13), హనుమ విహారి(14) ఉన్నారు. మూడో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 40 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు నష్టపోయి 94 పరుగులు చేసింది.

Also Read:

హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!

కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.!

 ఏపీలో కొత్త ‘స్ట్రెయిన్’ కలవరం.. యూకే నుంచి వచ్చినవారిలో నలుగురికి పాజిటివ్.!

Follow Us