టీమిండియాతో రెండో టీ20.. ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. సిరీస్‌పై గురి పెట్టిన భారత్ జట్టు.!

|

Dec 05, 2020 | 9:41 PM

టీమిండియాతో సిడ్నీ వేదికగా రేపు జరగనున్న రెండో టీ20‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది.

టీమిండియాతో రెండో టీ20.. ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. సిరీస్‌పై గురి పెట్టిన భారత్ జట్టు.!
Follow us on

India Vs Australia 2020: టీమిండియాతో సిడ్నీ వేదికగా రేపు జరగనున్న రెండో టీ20‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. తొలి ట20లో ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు గజ్జల్లో గాయం కావడంతో రేపటి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. ఆరోన్ ఫించ్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే రెండో టీ20  ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

ఇక ఇప్పటికే గాయాలు కారణంగా డేవిడ్ వార్నర్, స్టోయినిస్, అగర్‌, ప్యాట్ కమిన్స్‌లు జట్టుకు దూరమయ్యారు. అలాగే ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ స్థానంలో స్పిన్నర్ నాథన్ లియాన్‌లో ఆస్ట్రేలియా జట్టులో తీసుకుంది. ఇక ఇలా అర్ధాంతరంగా జట్టులో మార్పులు ఎలా చేస్తారని భారత్‌ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కాగా, ఆసీస్ జట్టును గాయాల బెడద వేధిస్తుండటంతో రెండో టీ20లో కూడా భారత్ జట్టు హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ రాణిస్తే టీమిండియాకు సునాయాసంగా విజయం దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అటు బౌలింగ్‌లో చాహల్, నటరాజన్, ఠాకూర్‌లకు తోడు బుమ్రా కూడా రెండో మ్యాచ్‌కు బరిలోకి దిగనున్నాడు.

Also Read:

Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..