భారత్, ఆస్ట్రేలియా షెడ్యూల్ వచ్చేసిందోచ్…
ఆసీస్ టూర్కు సంబంధించి భారత జట్టు పర్యటన షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. నవంబర్ 27 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుండగా..
India Tour Of Australia: ఆసీస్ టూర్కు సంబంధించి భారత జట్టు పర్యటన షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. నవంబర్ 27 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుండగా.. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ ఆస్ట్రేలియా టూర్కు సంబంధించి మూడు ఫార్మెట్లకు జట్లను ఎంపిక చేసింది. గాయం కారణంగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ ఇషాంత్ శర్మలకు రెస్ట్ ఇచ్చింది. ఇక షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
వన్డే సిరీస్:
- తొలి వన్డే: నవంబర్ 27, వేదిక- సిడ్నీ
- రెండో వన్డే: నవంబర్ 29, వేదిక- సిడ్నీ
- మూడో వన్డే: డిసెంబర్ 2. వేదిక- మనుక ఓవెల్, కాన్బెర్రా
టీ20 సిరీస్:
- తొలి టీ20: డిసెంబర్ 4, వేదిక- మనుక ఓవెల్, కాన్బెర్రా
- రెండో టీ20: డిసెంబర్ 6. వేదిక- సిడ్నీ
- మూడో టీ20: డిసెంబర్ 8, వేదిక- సిడ్నీ
టెస్ట్ సిరీస్:
- మొదటి ప్రాక్టీస్ మ్యాచ్(డిసెంబర్ 6-8): వేదిక-డ్రమ్మోయిన్ ఓవెల్, సిడ్నీ
- రెండో ప్రాక్టీస్ మ్యాచ్(డిసెంబర్ 11-13)(డే/నైట్): వేదిక- సిడ్నీ
- తొలి టెస్ట్: డిసెంబర్ 17-21 వరకు(డే/నైట్), వేదిక- అడిలైడ్
- రెండో టెస్ట్: డిసెంబర్ 26-30 వరకు, వేదిక- మెల్బోర్న్
- మూడో టెస్ట్: జనవరి 7-11 వరకు, వేదిక- సిడ్నీ
- నాలుగో టెస్ట్: జనవరి 15-19 వరకు, వేదిక-బ్రిస్బేన్
యూఏఈలో ఐపీఎల్ ముగిసిన అనంతరం నవంబర్ 12న భారత్ టీమ్ సరాసరి ఆస్ట్రేలియా పయనం కానుంది. సిడ్నీలో భారత జట్టు 14 రోజులు క్వారంటైన్లో ఉండటమే కాకుండా అక్కడే ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేయనుంది. దీని కోసం న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Also Read:
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..