వచ్చే ఏడాది ఐపీఎల్​ ఇండియాలోనే : స్ప‌ష్టం చేసిన గంగూలీ

నెక్ట్స్ ఇయ‌ర్ ఐపీఎల్​, ఇండియాలో జరగనుందని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలోనే భార‌త క్రికెట్ టీమ్ భవిష్యత్​ ప్రణాళికలపై బోర్డు ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ స్పందించారు.

వచ్చే ఏడాది ఐపీఎల్​ ఇండియాలోనే : స్ప‌ష్టం చేసిన గంగూలీ
Follow us

|

Updated on: Aug 22, 2020 | 6:45 PM

నెక్ట్స్ ఇయ‌ర్ ఐపీఎల్​, ఇండియాలో జరగనుందని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలోనే భార‌త క్రికెట్ టీమ్ భవిష్యత్​ ప్రణాళికలపై బోర్డు ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ఆస్ట్రేలియా టూర్ అనంత‌రం వచ్చే సంవత్సరం​ ఇంగ్లాండ్​కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు స్టేట్ క్రికెట్ బోర్డుల‌కు రాసిన లేఖలో గంగూలీ తెలియజేశాడు. దీని తర్వాత ఏప్రిల్​లో ఐపీఎల్​ను నిర్వహించనున్నట్లు వెల్ల‌డించాడు. వీటితో పాటే టీ20 వ‌రల్డ్ క‌ప్‌(2021), వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌కూ(2023) ఇండియా ఆతిథ్యమివ్వనుందని తెలిపాడు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ను యూఏఈలో జరపాల్సి వచ్చిన‌ట్టు వివ‌రించాడు.

“ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్​-2020 జరగనుంది. అంతా స‌క్ర‌మంగా జ‌రిగేంద‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ​పరిస్థితులన్నీ కుదుట‌ప‌డిన తర్వాత దేశవాళీ క్రికెట్​ను తిరిగి స్టార్ట్ చేస్తాం. ప్లేయ‌ర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే క‌రోనా నుంచి మ‌నందరం బ‌య‌ట‌కు వ‌స్తామ‌ని ఆశిస్తున్నా” అని సౌరభ్​ గంగూలీ తెలిపాడు.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !