భారత్ మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో లోపాలు ఉన్నాయి: శ్రీలంక ప్రధాని

| Edited By:

Apr 23, 2019 | 8:13 PM

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కొలంబోలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘భారతదేశం మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 300 మందికి పైగా మృతిచెందారు… 500 మందికి పైగా గాయపడ్డారు. శ్రీలంక పరిశోధకులు చైనా, పాకిస్థాన్లతో సహా అనేక దేశాలతో సన్నిహితంగా ఉన్నారని విక్రమసింఘే చెప్పారు. ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో […]

భారత్ మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో లోపాలు ఉన్నాయి: శ్రీలంక ప్రధాని
Follow us on

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కొలంబోలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘భారతదేశం మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 300 మందికి పైగా మృతిచెందారు… 500 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంక పరిశోధకులు చైనా, పాకిస్థాన్లతో సహా అనేక దేశాలతో సన్నిహితంగా ఉన్నారని విక్రమసింఘే చెప్పారు. ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో విషాదాన్ని నింపాయి. ప్రార్థనలు చేసేందుకు చర్చ్‌కు వెళ్లిన ఆ దేశీయులే కాదు.. విహారయాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు విదేశీయులు ఈ పేలుళ్లలో తమ ప్రాణాలను కోల్పోయారు. వందలమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఐసిస్ యొక్క అధికారిక అల్-అమాక్ వార్తా సంస్థ ఆత్మాహుతి బాంబర్లను “ఇస్లామిక్ స్టేట్ యొక్క యోధులు” అని పేర్కొంది. దీనిపై విదేశీ ఏజెన్సీల సహాయం కోరామని విక్రమసింఘే తెలిపారు. న్యూజిలాండ్ లోని ఒక మసీదు వద్ద గత నెలలో జరిగిన  దాడులకు ఈ ప్రతీకార చర్యలు జరిగాయని ప్రధాని ప్రకటించారు. “కానీ ఈ దాడుల ప్రణాళికకు ముందు కొన్ని సంకేతాలు ఉన్నాయి,” అని విక్రమసింఘే తెలిపారు.