గుంటూరులో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు
గుంటూరు లక్ష్మీ పురంలో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన మనోజ్ఞ భర్త, అత్తమామలు..ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. మనోజ్ఞ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఇద్దరినీ చంపేసి కింద పడేశారని ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని మనోజ్ఞ తమ్ముడు కార్తీక్ బలంగా వాదిస్తున్నాడు. గత కొంతకాలంగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. కాగా ఐదో అంతస్తుల భవనం […]
గుంటూరు లక్ష్మీ పురంలో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన మనోజ్ఞ భర్త, అత్తమామలు..ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. మనోజ్ఞ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఇద్దరినీ చంపేసి కింద పడేశారని ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని మనోజ్ఞ తమ్ముడు కార్తీక్ బలంగా వాదిస్తున్నాడు. గత కొంతకాలంగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.
కాగా ఐదో అంతస్తుల భవనం పైనుంచి మనోజ్ఞ కిందపడిప్పటికీ బ్లీడింగ్ ఏమీ అవ్వకపోవడం, ఎముకలు కూడా విరిగినట్టు కనిపించకపోవడంతో అనుమానులు మరింత తీవ్రం అయ్యాయి.
Also Read :
‘డియర్ కామ్రేడ్’ అరుదైన ఘనత : ఇండియాలోనే నెం.1
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు