గుంటూరులో విషాదం..బ్యాంకులో ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

|

Apr 18, 2020 | 1:35 PM

గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన క‌ల‌క‌లం రేపింది. మృతులను అబ్దుల్లా, రేష్మలుగా నిర్దార‌ణ అయ్యింది. వీరిద్దరూ కాలేజ్ లో చ‌దువుకుంటున్న‌ప్ప‌టి నుంచే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. చదువులు ముగిసిన అనంత‌రం వీరు బ్రాడీపేటలోని రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఈ ప్రేమ జంట‌ బ్యాంక్‌లోనే సూసైడ్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆత్మహత్యకు గల అసలు రీజ‌న్స్ తెలియాల్సి ఉంది. రేష్మా రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆమె పేరెంట్స్ పాత గుంటూరు పీఎస్ లో […]

గుంటూరులో విషాదం..బ్యాంకులో ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌
Follow us on

గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన క‌ల‌క‌లం రేపింది. మృతులను అబ్దుల్లా, రేష్మలుగా నిర్దార‌ణ అయ్యింది. వీరిద్దరూ కాలేజ్ లో చ‌దువుకుంటున్న‌ప్ప‌టి నుంచే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. చదువులు ముగిసిన అనంత‌రం వీరు బ్రాడీపేటలోని రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఈ ప్రేమ జంట‌ బ్యాంక్‌లోనే సూసైడ్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆత్మహత్యకు గల అసలు రీజ‌న్స్ తెలియాల్సి ఉంది.

రేష్మా రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆమె పేరెంట్స్ పాత గుంటూరు పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు ఆమె నెంబర్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు బ్రాడీపేటలోని బ్యాంక్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి యువతి యువకుల డెడ్ బాడీస్ కనిపించాయి. దీంతో వారి తల్లి దండ్రులు విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ‌ పెళ్లికి పెద్దలు అంగీకారం తెల‌ప‌కపోవ‌డంతో ఆత్మహత్యకు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.