వారికి.. రెండు నెలల రేషన్ ఉచితం: కేంద్రం

Free foodgrain supplies: రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో పప్పు ధాన్యాలు పంపిణి చేస్తామని.. కార్డులేని పేదలు కూడా రేషన్ పొందవచ్చంది. ఇక వలస కార్మికులు దేశంలో ఎక్కడున్నా.. కార్డు లేకున్నా రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చన్నారు. దీని ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి […]

వారికి.. రెండు నెలల రేషన్ ఉచితం: కేంద్రం

Updated on: May 14, 2020 | 5:36 PM

Free foodgrain supplies: రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో పప్పు ధాన్యాలు పంపిణి చేస్తామని.. కార్డులేని పేదలు కూడా రేషన్ పొందవచ్చంది. ఇక వలస కార్మికులు దేశంలో ఎక్కడున్నా.. కార్డు లేకున్నా రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చన్నారు. దీని ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. వలస కార్మికులకు నగదు పంపిణి చేశాం. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12 వేల కోట్లు ఇప్పటికే అందించాం. ఉపాధి హామీ పథకం కింద 10 వేల కోట్లు ఇప్పటికే బట్వాడా చేశామని తెలిపారు. దేశమంతా ఒకటే కనీస వేతనం ఉండేలా చూస్తామని స్పష్టంచేశారు.

[svt-event date=”14/05/2020,5:10PM” class=”svt-cd-green” ]

Loading...
Unable to load recommendations.
Follow Us