Good News From Jagan Government: కాపులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కాపు, తెలగ, బలిజ కులాలు, ఉపకులాలకు చెందిన మహిళలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మహిళలకు ప్రతీ ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాలవలవన్ మార్గదర్శకాలను జారీ చేశారు.
ఎవరు అర్హులంటే…
ఎంపిక ఎలాగంటే…
ఈ పథకం కింద లబ్ధిదారులను గ్రామ, వార్డు వాలంటీర్లు ఎంపిక చేస్తారు. వారు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. ఈ పథకానికి రూ. 1101.69 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కాగా, ఈ పథకం అమలు కోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇక అందులో వివరాలన్నింటినీ పొందుపరచనున్నారు.