జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఓటు వేయడానికి ఓటర్లు ఇళ్లుదాటి బయటకు రావడం లేదు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ అన్ని రకాల ప్రచారం నిర్వహించినా ఓటు వేయడానికి నగరం జనం అంతగా ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు 18.20 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.