AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC election result 2020 live counting : గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై టీవీ9 ఎక్స్‌క్లూజివ్ కవరేజ్

గ్రేటర్‌లో గెలిచేదెవరు? మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ మళ్లీ పాగా వేస్తుందా? దుబ్బాక గెలుపు ఇచ్చిన జోష్‌తో బీజేపీ సత్తా చాటుతుందా? పాతబస్తీ మళ్లీ మజ్లిస్‌దేనా?...

GHMC election result 2020 live counting  : గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై టీవీ9 ఎక్స్‌క్లూజివ్ కవరేజ్
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Dec 04, 2020 | 3:28 PM

Share

గ్రేటర్‌లో గెలిచేదెవరు? మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ మళ్లీ పాగా వేస్తుందా? దుబ్బాక గెలుపు ఇచ్చిన జోష్‌తో బీజేపీ సత్తా చాటుతుందా? పాతబస్తీ మళ్లీ మజ్లిస్‌దేనా? కాంగ్రెస్‌ పుంజుకుంటుందా? ఇంతకీ హైదరాబాద్‌ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ నేడు జవాబు రాబోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ కాసేపట్లో మొదలుకానుంది.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొత్తం 30 ప్రాంతాల్లో 166 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16 డివిజన్లకు రెండు కౌంటింగ్‌ హాళ్లు సిద్ధం చేశారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కౌంట్‌ చేస్తారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ హాల్‌లో రిటర్నింగ్ అధికారి, సహాయరిటర్నింగ్ అధికారి ఉంటారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రానికి పరిశీలకుడిని నియమించారు. అభ్యర్థులు టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంది. ఏజెంట్లకు రిలీవింగ్‌ సౌకర్యం లేదు. కౌంటింగ్‌ హాళ్లలోకి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లవద్దు. ఏజెంట్లు రిటర్నింగ్‌ అధికారుల దగ్గర పాసులు తీసుకోవాలి. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా ఎన్నికలకు సంబంధించిన మినిట్ టు మినిట్ లైవ్ టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. టీవీ9 వెబ్‌ వెబ్‌సైట్‌లో కూడా ఎక్స్‌క్లూజీవ్‌గా మీరు ఫలితాలు తెలుసుకోవచ్చు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..