బ్రేకింగ్ : అరుణ్ జైట్లీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు. 2018లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి అస్వస్థులయ్యారు. దీనితో పాటు డయాబెటిస్ కారణంగా శరీరం బరువు పెరగడంతో ఆయనకు “బెరియాట్రిక్ సర్జరీ” కూడా జరిగింది. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. మోదీకి అత్యంత ఆప్తుడయ్యారు. అనారోగ్యం […]

బ్రేకింగ్ : అరుణ్ జైట్లీ కన్నుమూత

Edited By:

Updated on: Aug 24, 2019 | 2:37 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు. 2018లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి అస్వస్థులయ్యారు. దీనితో పాటు డయాబెటిస్ కారణంగా శరీరం బరువు పెరగడంతో ఆయనకు “బెరియాట్రిక్ సర్జరీ” కూడా జరిగింది. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. మోదీకి అత్యంత ఆప్తుడయ్యారు. అనారోగ్యం కారణంగానే తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే.