అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:40 PM

ఇల్లినాయిస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ షికాగోకు 65కి.మీల దూరంలో వాల్వుల తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని మట్టుబెట్టారు. అయితే అతడు ఈ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడో కారణాలు తెలియరాలేదు.

అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి
Follow us on

ఇల్లినాయిస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ షికాగోకు 65కి.మీల దూరంలో వాల్వుల తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని మట్టుబెట్టారు. అయితే అతడు ఈ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడో కారణాలు తెలియరాలేదు.