మెగా హ్యాకింగ్ లో 5 గురు చైనీయులు, భారత నెట్ వర్క్ లకూ దెబ్బ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 17, 2020 | 11:14 AM

ప్రపంచ వ్యాప్తంగా 100 కంపెనీలు, ప్రైవేట్ సంస్ధల నెట్ వర్క్ లలో చొరబడి భారీ హ్యాకింగ్ కి పాల్పడిన ఐదుగురు చైనీయులపై అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. హ్యాకింగ్ కి గురైనవాటిలో ఇండియన్ నెట్ వర్క్ లు..

మెగా హ్యాకింగ్ లో 5 గురు చైనీయులు, భారత నెట్ వర్క్ లకూ దెబ్బ !
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా 100 కంపెనీలు, ప్రైవేట్ సంస్ధల నెట్ వర్క్ లలో చొరబడి భారీ హ్యాకింగ్ కి పాల్పడిన ఐదుగురు చైనీయులపై అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. హ్యాకింగ్ కి గురైనవాటిలో ఇండియన్ నెట్ వర్క్ లు కూడా ఉన్నాయి. వీటిలో . భారత ప్రభుత్వ వెబ్ సైట్లు, ప్రైవేట్ నెట్ వర్క్ లు, ప్రభుత్వానికి తోడ్పడే డేటా బేస్ సర్వర్లు కూడా ఉన్నాయని అమెరికా తెలిపింది. భారత ప్రభుత్వ ఆధీనంలోని ఓపెన్ వీపీఎన్ నెట్ వర్క్ తో కనెక్ట్ అయ్యేందుకు ఈ కుట్రదారులు వీపీఎస్ ప్రొవైడర్ సర్వర్లను వినియోగించుకున్నారని తెలిసింది. అలాగే భారత ప్రభుత్వ ప్రొటెక్టెడ్ కంప్యూటర్స్ లో లోపభూయిష్టమైన ‘ కోబాల్ట్ స్ట్రైక్’ ని కూడా వీరు ఇన్ స్టాల్ చేశారు. 2019 లో జరిగిన ఈ భారీ సైబర్ క్రైమ్ కి అమెరికాతో బాటు వివిధ దేశాల నెట్ వర్క్ లు వందకు పైగా గురయ్యాయి.

వీరు విలువైన సాఫ్ట్ వేర్ ను, బిజినెస్ ఇంటెలిజెన్స్ ను చాకచక్యంగా దొంగిలించారని యుఎస్  డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోజెన్ తెలిపారు. ఈ  ఐదుగురు చైనీయులకు  ఇద్దరు మలేసియా దేశస్థులు కూడా తోడై  వీరితో చేతులు కలిపారన్నారు. ఈ హ్యాకర్లు కొంతమంది బాధితులకు ఈ సాఫ్ట్ వేర్ ను అమ్మి భారీగా సొమ్ము వెనకేసుకున్నారట.. గత ఆదివారం ఇద్దరు మలేషియన్లను అరెస్టు చేయగా, చైనీయులు పారిపోయారు. .  వీరిని ‘పరారీలో ఉన్న నేరస్థులుగా’ అమెరికా ప్రకటించింది. చైనా ప్రభుత్వాన్ని జెఫ్రీ తీవ్రంగా తప్పు పడుతూ ఇల్లీగల్ కంప్యూటర్ చొరబాట్లను, సైబర్ దాడులను ఆ దేశం ప్రోత్సహిస్తోందన్నారు. అమాయక ప్రజలను కూడా ముగ్గులోకి లాగుతోందన్నారు.

తమకు (చైనా) సహాయపడే మేధా సంపత్తిని దొంగిలించడానికి చైనా  ఇలాంటి హ్యాకర్లను వినియోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. కాగా-సెక్యూరిటీ రీసెర్చర్లు.. ఏపీటీ 41, బేరియం, వింటి, విక్స్డ్ పాండా, విక్స్డ్ స్పైడర్ వంటి లేబుల్స్ ను వినియోగించి ఈ చొరబాట్లను ట్రా5క్ చేయగలిగారు.