AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులూ బీ అలర్ట్.. ఫాస్టాగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికే అనుమతి..

ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు విధానానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని..

వాహనదారులూ బీ అలర్ట్.. ఫాస్టాగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికే అనుమతి..
Shiva Prajapati
|

Updated on: Dec 04, 2020 | 7:19 AM

Share

ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు విధానానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం.. అందుకు అనుగుణంగా ముందడగు వేసింది. ఇందులో భాగంగా ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలను టోల్‌ప్లాజాలోకి అనుమతించాలని ఆదేశించింది. ఇకపై టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు ఉండబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. అంతేకాదు ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని టోల్ ప్లాజాల వద్ద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఫాస్టాగ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో వాహనదారులు ఫాస్టాగ్‌ను పొందవచ్చు అని తెలిపింది.

ఇదిలాఉండగా, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 18 టోల్ ప్లాజాలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 17 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అన్ని ప్లాజాల్లో ఒక లేన్‌ను నగదు చెల్లింపులకు కేటాయించి మిగతా లేన్లలో ఫాస్టాగ్‌ అమలు చేస్తున్నారు. అయితే, గత ఏడాది డిసెంబరు నుంచే అన్ని లేన్లనూ ఫాస్టాగ్‌కే కేటాయించాలని కేంద్రం భావించింది. కానీ, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ణప్తి మేరకు ఫాస్టాగ్‌ లేన్లలో ఒక దానిని నగదు చెల్లింపులకు కేటాయించింది. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి పూర్తిగా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. వాహనదారులు ఇకనైనా అలర్ట్ అయి ఫాస్టాగ్ తీసేసుకోండి.. లేదంటే నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తుంది.

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!