తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డిగ్రీ ఆడ్మిషన్ల ప్రక్రియను ఆగష్టు 31కు పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు...
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవలే ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక 2020-21 విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఈ డిగ్రీ ఆడ్మిషన్ల ప్రక్రియను ఆగష్టు 31కు పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు. దోస్త్ గురించి పూర్తి సమాచారం కొరకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించండి.
డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల…
జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం
జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం