AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కాలుష్య భూతం

శీతాకాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ.. ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆరంభ చలికాలం నరకాన్ని చూపిస్తుంటుంది.. విపరీతమైన కాలుష్యమే అందుకు కారణం.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో..

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కాలుష్య భూతం
Balu
|

Updated on: Sep 21, 2020 | 3:52 PM

Share

శీతాకాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ.. ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆరంభ చలికాలం నరకాన్ని చూపిస్తుంటుంది.. విపరీతమైన కాలుష్యమే అందుకు కారణం.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం జనాలకు ఇబ్బంది పెడుతుంటుంది.. అసలే ఇది కరోనా కాలం.. దీనికి కాలుష్యం తోడైతే ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. కరోనా పేషంట్ల ఊపిరితిత్తులపై ఇది పెను ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాది చలికాలం ఆరంభంలో పంట మొదళ్లను తగలబెట్టడం పంజాబ్‌, హర్యానాలకు ఆనవాయితీగా మారింది.. ఎవరు ఎంతగా చెప్పినా రైతులు వినిపించుకోవడం లేదు.. ఫలితం ఢిల్లీతో పాటు ఉత్తరభారతంలో కొన్ని ప్రదేశాలు కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నాయి.. కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువులు వాతావరణంలో పెరిగిపోతున్నాయి. ఫలితంగా శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా బాధితుల ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం కూడా ఉంది. పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదని, పైగా నేలలో ఉండే సిలికాన్‌ కూడా తగ్గిపోతుందని ఎంతగా చెబుతున్నా రైతులు మాత్రం వినడం లేదు.. సిలికాన్‌ తగ్గితే మనిషిలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. రైతుల మీద కేసులు పెట్టినా వారు ఈ అలవాటు మానడం లేదు. నిరుడు పంజాబ్‌లో ఇలా పంట మొదళ్లను తగులపెట్టిన 50 వేల మందిపై కేసులు పెట్టారు.. కాలుష్యం కారణంగా హర్యానా, పంజాబ్‌లతో పాటు ఢిల్లీకి కూడా తీవ్రంగా నష్టపోతున్నది..

Follow Us
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..