దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు, 391 మరణాలు.. పెరుగుతున్న రికవరీ శాతం..

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 32,981 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో...

దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు, 391 మరణాలు.. పెరుగుతున్న రికవరీ శాతం..

Updated on: Dec 07, 2020 | 11:37 AM

Corona Cases India: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 32,981 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,96,729 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 91,39,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 391 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,40,573 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 39,109 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 8,01,081 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 14,77,57,656కు చేరింది. దేశంలో సుమారు 94.45 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 4.10 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.