దుబ్బాకలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. టీఆర్ఎస్‌లో చేరిన హస్తం నేత

|

Oct 12, 2020 | 4:54 PM

మొన్నటి ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ నేత మద్దుల నాగేశ్వరరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మంత్రి హరీష్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నాగేశ్వరరెడ్డి చేరికతో దుబ్బాకలో...

దుబ్బాకలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. టీఆర్ఎస్‌లో చేరిన హస్తం నేత
Follow us on

Joins TRS Party : దుబ్బాక ఎన్నికల ప్రచారం హాట్ హాట్ సాగుతోంది. పోటా పోటీ ప్రచారంలో టీఆర్ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు కారు గుర్తు వైపు మొగ్గు చూపుతుండగా… మరికొందరు నేరుగా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు పార్టీలో చేరిపోయారు.

మొన్నటి ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ నేత మద్దుల నాగేశ్వరరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మంత్రి హరీష్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నాగేశ్వరరెడ్డి చేరికతో దుబ్బాకలో కాంగ్రెస్‌ ఖాళీ అయిందన్నారు మంత్రి హరీష్ రావు ‌. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మైకాసురులని, మైకుల ముందు, సోషల్‌ మీడియాలో గర్జనలు తప్ప… ఓట్ల దగ్గరకు వచ్చే సరికి వారి డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఎద్దేవ చేశారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే జరిగిందన్నారు మంత్రి హరీష్‌రావు.