చౌటుప్పల్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు వరకు వెళ్లింది. ముందుగా ఇక్కడ సీపీఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోని మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఫలితాల అనంతరం ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కాసారిగా మారిపోయాయు. సీపీఎం సభ్యులతో కోమరెడ్డి రాజగోపాల్రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు బాహాబాహికి దిగారు. దాడులు జరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి..పరిస్థితి అదుపులోకి తెస్తున్నారు.
చౌటప్పల్ మునిపిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకుంది. చైర్మన్ ఎంపిక విషయంలో అన్ని రాజకీయ పక్షాలు గేమ్ ప్లాన్ను అమలు చేశాయి. చౌటప్పల్ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా.. టీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, సీపీఎం 3 స్థానాల్లో విజయం సాధించగా..ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఇక్కడ ఎమ్మల్యే రాజగోపాల్రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 6 స్థానాలకు చేరుకుంది. అయితే అప్పటివరకు తమతో ఉన్న సీపీఎం ప్లేటు ఫిరాయించడంతో..కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. ఎమ్మల్యే కోమటిరెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. సీపీఎం కార్యకర్తలకు మద్దతుగా, టీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.