AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నా నైజీరియన్ డ్రగ్స్ రాకెట్ యధేచ్ఛగా మత్తు పదార్థాల దందా నిర్వహిస్తోంది. తాజాగా తార్నాకలో ఇద్దరు నైజీరియన్లను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ ‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్‌, లక్షా 64వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
Balaraju Goud
|

Updated on: Jul 19, 2020 | 9:12 PM

Share

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నా నైజీరియన్ డ్రగ్స్ రాకెట్ యధేచ్ఛగా మత్తు పదార్థాల దందా నిర్వహిస్తోంది. తాజాగా తార్నాకలో ఇద్దరు నైజీరియన్లను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ ‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్‌, లక్షా 64వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. గత కొద్దికాలంగా మాదకద్రవ్యాలు అమ్ముతున్న జోడి పాస్కెల్‌ అతని ప్రియురాలు మోనికలను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం మోనిక, ముంబయి నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్‌ ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీంతో పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారలు తార్నాక కూడలి వద్ద ఇద్దరిని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంటు అధికారులు అరెస్టు చేశారు. జోడిపాస్కెల్‌, మోనిక నివాసముంటున్న తార్నాకలోని నాగార్జున కాలనీలోని అపార్టుమెంట్ లో అధికారులు సోదాలు నిర్వహించారు.