కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రండి
సీఎం కేసీఆర్ ఇవాళ విజయవాడ బయల్దేరనున్నారు. ఉదయం 11.40 నిమిషాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ను ప్రారంభించిన అనంతరం.. బేగంపేట నుంచి విజయవాడ వెళ్లనున్నారు. అనంతరం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ను కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్తరాధికారి దీక్షకు ఇరువురు సీఎంలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా శారాదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ స్వామి బాధ్యతలు […]
సీఎం కేసీఆర్ ఇవాళ విజయవాడ బయల్దేరనున్నారు. ఉదయం 11.40 నిమిషాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ను ప్రారంభించిన అనంతరం.. బేగంపేట నుంచి విజయవాడ వెళ్లనున్నారు. అనంతరం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ను కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్తరాధికారి దీక్షకు ఇరువురు సీఎంలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా శారాదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ స్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యక్రమానంతరం సాయంత్రం 7.30 గంటలకు విజయవాడ నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్కు రానున్నారు.