నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

|

Nov 20, 2020 | 4:56 PM

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌, నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
Follow us on

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌, నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కొడుకు, శంషావలి, కూతురు సాజీదాలను తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద పరామర్శించారు ముఖ్యమంత్రి.

సలాం అత్త మాబున్నీసా కు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన 25 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ద్వారా అందించి, తమ కుటుంబానికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపిన సలాం అత్త మాబున్నీసా. తన కూతురు సాజీదా కు ఉద్యోగం ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న తన అల్లుడిని అనంతపురం నుండి నంద్యాలకు బదిలీ చేయాలని, దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రిని సలాం అత్త మాబున్నీసా కోరారు.

సలాం కుటుంబం ఆత్మహత్య కు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని సలాం అత్త మాబున్నీసాకు ధైర్యం చెప్పి సీఎం జగన్ హామీ ఇచ్చారు.

సీఎం ఆదేశాల మేరకు సలామ్ అత్త కొడుకు శంషావలి ని అనంతపురం డిఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నుండి నంద్యాల వైద్య ఆరోగ్య శాఖ కు క్షణాలపై డెప్యూటేషన్ ఆర్డర్స్ ఇప్పించారు జిల్లా కలెక్టర్ వీరపాండియన్.