ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక రైళ్లలో ఏపీకి చేరుకునేవారి ద్వారా వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు హల్టింగ్ స్టేషన్ల సంఖ్యను కుదించాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనితో ఎస్సీఆర్ జోన్ అధికారులు ప్రత్యేక రైళ్ల స్టాపుల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రం మీదుగా నడుస్తున్న 22 రైళ్లు ఇప్పటివరకు 70 స్టేషన్లలో ఆగగా.. ఇకపై కేవలం 18 స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇది అమలులోకి రానుంది. విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, మంత్రాలయం రోడ్, గుంతకల్లు, కడప, ఆదోని, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు, కుప్పం, రేణిగుంట, అనకాపల్లి, మంగళగిరి స్టేషన్లలోనే స్పెషల్ ట్రైన్స్ అగనున్నాయి.
ఇక రద్దైన స్టాపుల్లో ఎక్కేందుకు, దిగేందుకు టికెట్లను రద్దు చేసుకున్న ప్రయాణీకులకు డబ్బులు రీఫండ్ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాగా, గోదావరి ఎక్స్ప్రెస్ అనకాపల్లి స్టేషన్లో ఆగనుండగా.. గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు మంగళగిరి స్టాప్లో ఆగుతుంది.
ఏపీ గుండా వెళ్లే రైళ్లకు రద్దయిన స్టాపుల వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read: కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!