ఓటమి కారణాలపై నేతలతో చంద్రబాబు

| Edited By:

Jun 04, 2019 | 11:11 AM

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలపై నియోజకవర్గాల వారీగా మాజీ సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ముందుగా సొంత నియోజకవర్గమైన కుప్పం నేతలతో చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7 వ తేదీన విదేశీ పర్యటన వెళ్లనున్న నేపథ్యంలో…ఈలోగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. విదేశీ పర్యటన అనంతరం నియోజకవర్గాల నేతలతో చర్చించనున్నారు. కాగా.. సోమవారం మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి రాష్ట్రంలోని వివిధ […]

ఓటమి కారణాలపై నేతలతో చంద్రబాబు
Follow us on

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలపై నియోజకవర్గాల వారీగా మాజీ సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ముందుగా సొంత నియోజకవర్గమైన కుప్పం నేతలతో చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7 వ తేదీన విదేశీ పర్యటన వెళ్లనున్న నేపథ్యంలో…ఈలోగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. విదేశీ పర్యటన అనంతరం నియోజకవర్గాల నేతలతో చర్చించనున్నారు.

కాగా.. సోమవారం మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. తామంతా పార్టీకి జీవితాంతం అండగా ఉంటామని, మీరు పోరాటం కొనసాగించాలని చంద్రబాబు మద్దతు ప్రకటించారు. అయితే.. ఎన్నికల్లో ఆధిక్యత తగ్గటం బాధగా ఉందని, తమను క్షమించాలని అధినేతను కోరగా.. అందులో నేతల తప్పేమీ లేదని చంద్రబాబు సర్ధిచెప్పారు. అయితే.. మెజార్టీ ఇంతగా తగ్గిపోవటానికి కారణాలేంటో మాత్రం తెలుసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఇన్ని విధాలుగా మనం పోరాడినా ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేకపోయామో తెలుసుకోవాలన్నారు.