Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాపు నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు

నేటి నుంచి గుంటూరు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పార్టీ సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గుంటూరు టీడీపీ కార్యాలయానికి చేరుకుని అనంతరం కాపు నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న కాపు సామాజికవర్గ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో చాలా మంది బీజేపీ నేత రాం మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. […]

కాపు నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 11:42 AM

నేటి నుంచి గుంటూరు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పార్టీ సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గుంటూరు టీడీపీ కార్యాలయానికి చేరుకుని అనంతరం కాపు నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

టీడీపీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న కాపు సామాజికవర్గ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో చాలా మంది బీజేపీ నేత రాం మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారేందుకు వీరంతా వివిధ కారణాలను వెతుక్కుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న కాపు నేతలను చంద్రబాబు బుజ్జగించనున్నారు.