ఈ నెల 22 నుంచి సీబీఎస్ఈ సప్లిమెంటరీ పరీక్షలు
ఈ నెల 22 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనుంది సీబీఎస్ఈ. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ఈ నెల 22 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనుంది సీబీఎస్ఈ. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. సెప్టెంబర్ 29 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటితో పాటు 12 వ తరగతి విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించనుంది.
అంతకుముందు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో తీవ్ర వ్యతిరేకతను తెలియజేసింది సీబీఎస్ఈ. స్టూడెంట్స్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సురక్షిత చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు వివరించింది. కేసును కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది.
Also Read :
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా టెర్రర్..కేంద్రం కీలక ఆదేశాలు