బ్యాంకు నిధుల దుర్వినియోగం కేసులో ముగిసిన సీబీఐ సోదాలు.. కీలక ఆధారాలు స్వాధీనం

| Edited By: uppula Raju

Dec 19, 2020 | 12:09 AM

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సరియైన ఆధారాలు చూపని కేసుకు సంబంధించి సీబీఐ దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి శుక్రవారం టీడీపీ మాజీ ఎంపీ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

బ్యాంకు నిధుల దుర్వినియోగం కేసులో ముగిసిన సీబీఐ సోదాలు.. కీలక ఆధారాలు స్వాధీనం
Follow us on

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సరియైన ఆధారాలు చూపని కేసుకు సంబంధించి సీబీఐ దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి శుక్రవారం టీడీపీ మాజీ ఎంపీ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ ఎంపీ స్వస్థలమైన గుంటూరు జిల్లాతోపాటు, హైదరాబాద్‌ మహానగరంలోని కార్యాలయాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ కార్యాలయాల్లోని తమ సహచరుల సహకారంతో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది.

మాజీ ఎంపీకి చెందిన కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ. 7,926 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి సరియైన ఆధారాలను చూపలేదని అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించిందని ఆరోపణ. ఈ వ్యవహారంలో ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.