బొగ్గు స్కామ్ కేసు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి బెయిల్ మంజూరు

ఝార్ఖండ్ లో   నాడు  జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో దోషి, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  లక్ష రూపాయల పూచీకత్తుతో ఇతనితో బాటు మరో ఇద్దరు  మాజీ అధికారులకు కూడా బెయిల్ లభించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీరికి వచ్ఛేనెల 25 వరకు కోర్టు గడువునిచ్చింది. 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న దిలీప్ రే…గిరిధ్ జిల్లాల్లో జరిగిన బొగ్గు కేటాయింపుల్లో […]

బొగ్గు స్కామ్ కేసు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి బెయిల్ మంజూరు

Edited By:

Updated on: Oct 26, 2020 | 3:24 PM

ఝార్ఖండ్ లో   నాడు  జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో దోషి, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  లక్ష రూపాయల పూచీకత్తుతో ఇతనితో బాటు మరో ఇద్దరు  మాజీ అధికారులకు కూడా బెయిల్ లభించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీరికి వచ్ఛేనెల 25 వరకు కోర్టు గడువునిచ్చింది. 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న దిలీప్ రే…గిరిధ్ జిల్లాల్లో జరిగిన బొగ్గు కేటాయింపుల్లో పలు అవకతవకలకు పాల్పడినట్టు సీబీఐ అభియోగం మోపింది.  మొదట ఈ కేసులో ఈయనకు కోర్టు… మూడేళ్ళ జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించింది. అయితే మధ్యాహ్నానికి సీన్ మారింది.  తమ వయస్సు రీత్యా తమకు బెయిల్ ఇవ్వాలని ఈ దోషులు కోర్టును కోరారు.

 

 

Follow Us