బెంగాల్‌ బార్డ‌ర్‌లో పట్టుబడిన అరుదైన పక్షులు.. పంజ‌రంతో స‌హా అక్క‌డే వదిలేసి పారిపోయిన స్మగ్లర్లు

|

Nov 25, 2020 | 7:15 PM

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్  అధికారులు అరుదైన జాతికి చెందిన ప‌క్షుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ముఠాను పట్టుకున్నారు. స‌ద‌రు ప‌క్షుల‌ను దుండగులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ లోకి తీసుకువస్తుండగా..

బెంగాల్‌ బార్డ‌ర్‌లో పట్టుబడిన అరుదైన పక్షులు.. పంజ‌రంతో స‌హా అక్క‌డే వదిలేసి పారిపోయిన స్మగ్లర్లు
Follow us on

‌బెంగాల్‌లోని బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్  అధికారులు అరుదైన జాతికి చెందిన ప‌క్షుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ముఠాను పట్టుకున్నారు. స‌ద‌రు ప‌క్షుల‌ను దుండగులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ లోకి తీసుకువస్తుండగా.. స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌క్షులను స్మ‌గ్లింగ్లర్లను చూశారు. ఈ క్ర‌మంలో ఆ ప‌క్షుల‌ను వారు స్వాధీనం చేసుకుని జూకు త‌ర‌లించారు.

దక్షిణ ‌బెంగాల్‌లోని హ‌ల్ద‌ర్ తేటు బల్బిరాయ  అట‌వీ ప్రాంతంలో ప‌క్షుల స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టారు. అయితే సిబ్బందిని చూసిన స్మ‌గ్ల‌ర్లు ప‌క్షుల‌ను పంజ‌రంతో స‌హా అక్క‌డే వదిలేసి పారిపోయారు. వారిని ప‌ట్టుకునేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది య‌త్నించారు. కానీ ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డం వ‌ల్ల వారికి నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం సాధ్య‌ప‌డ‌లేదు.

కాగా ఆ పంజ‌రంలో అరుదైన బ్లూ కలర్ రామ చిలుకలు ఉన్నట్లుగా వారు తెలిపారు. అవి అత్యంత అరుదైన జాతికి చెందిన‌వి. వాటి విలువ సుమారుగా రూ.14.21 ల‌క్ష‌లు ఉంటుంది. వాటిని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకుని జూకు త‌ర‌లించారు.