బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ కు కరోనా పాజిటివ్

|

Oct 22, 2020 | 7:44 AM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరో బీజేపీ ముఖ్యనేత కరోనా బారినపడ్డారు.

బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ కు కరోనా పాజిటివ్
Follow us on

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరో బీజేపీ ముఖ్యనేత కరోనా బారినపడ్డారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుసేన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. తాను కరోనా పాజిటివ్ వ్యక్తులను కలవడం వల్లనే తనకు కొవిడ్ పాజిటివ్ గా వచ్చిందని, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని షానవాజ్ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. షానవాజ్ ఇటీవల కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కేసులున్న జాతి వ్యతిరేకి అయిన మాస్కూర్ ఉస్మానీకి బీహార్ మహా ఘట్ బంధన్ పక్షాన సీటు ఇచ్చారని ఆయన ఆరోపించారు. జిన్నా విధానాలను మహాఘట్ బంధన్ పాటిస్తుందా అని షానవాజ్ ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల సమయంలో షానవాజ్ కరోనా బారిన పడటం పార్టీశ్రేణుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది.