ప‌శ్చిమ‌బెంగాల్‌పై క‌మ‌ల‌ద‌ళం స్పెష‌ల్ ఫోక‌స్‌‌.. ఇక‌పై నెల‌కు ఏడు రోజులు బెంగాల్‌లో మ‌కాం వేయ‌నున్న అమిత్ షా..!

ప‌శ్చిమ‌బెంగాల్‌పై బీజేపీ స్పెష‌ల్‌ ఫోక‌స్ పెట్టింది. తృణ‌మూల్ అధికార పీఠాన్ని దించేలా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో..

ప‌శ్చిమ‌బెంగాల్‌పై క‌మ‌ల‌ద‌ళం స్పెష‌ల్ ఫోక‌స్‌‌.. ఇక‌పై నెల‌కు ఏడు రోజులు బెంగాల్‌లో మ‌కాం వేయ‌నున్న అమిత్ షా..!
Follow us

|

Updated on: Dec 21, 2020 | 12:02 PM

ప‌శ్చిమ‌బెంగాల్‌పై బీజేపీ స్పెష‌ల్‌ ఫోక‌స్ పెట్టింది. తృణ‌మూల్ అధికార పీఠాన్ని దించేలా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో వ్యూహాలు ర‌చిస్తోంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి జ‌ర‌గ‌నంత వ‌ర‌కు బెంగ‌ల్ రాజ‌కీయాలు ఒక ఎత్తైతే.. కాన్వాయ్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత ఒక ఎత్తైంది. ఈ ఘ‌ట‌న‌లో బెంగాల్‌పై కాషాయ ద‌ళం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. ఏకంగా 9 మంది ఎమ్మెల్యేల‌ను, ఓ ఎంపీకి బీజేపీ కండువా క‌ప్పి అటు అధికార పార్టీకి, ఇటు విప‌క్షాల‌కు గ‌ట్టి షాకిచ్చింది. అంతేకాకుండా ఏకంగా ఆరుగురు కేంద్ర మంత్రుల‌ను బెంగాల్‌కు పంపింది క‌మ‌ళ‌ద‌ళం.

నెల‌లో 15 రోజుల పాటు బెంగాల్‌లో మ‌కాం వేయాల‌ని నిర్ణ‌యించింది. ఏలాగైనా ఈ సారి బెంగాల్‌లో బీజేపీ జెండా పాతాల‌ని ప‌దునైనా వ్యూహాలు ర‌చిస్తోంది. అంతేకాకుండా మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక‌పై నెల‌కోసారి ఖ‌చ్చితంగా బెంగాల్‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా నెల‌కు ఏడు రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేస్తార‌ని బీజేపీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ ప్ర‌కటించారు. ఇక‌పై అమిత్ త‌ర‌చూ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తారు.. ఓ నెల‌లో ఏడు రోజుల పాటు బెంగాల్‌లో మ‌కాం వేసి దిశానిర్దేశం చేస్తార‌ని తెలిపారు.

బీజేపీ వ్యూహం ఫ‌లిస్తుందా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల జేపీ న‌డ్డా కాన్వాయ్ పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో బెంగాల్‌పై బీజేపీ మ‌రింత దృష్టి సారించింది. ముందు నుంచే ప‌క్కా ప్లాన్ వేసి బెంగాల్ ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవాల‌న్న‌ది బీజేపీ ల‌క్ష్యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ముందు నుంచే వ్యూహాలు ర‌చిస్తోంది బీజేపీ. మ‌రి బెంగాల్ పై క‌షాయ ద‌ళం వేస్తున్న వ్య‌వూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?