రామతీర్థయాత్ర అరెస్టుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు, నందికొట్కూరులో బీజేపీ నేతల అరెస్టులు

బీజేపీ-జనసేన నిన్న రామతీర్థం యాత్ర చేపట్టడం, సదరు ర్యాలీని అడ్డుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు, నేతల గృహనిర్భంధాలు..

రామతీర్థయాత్ర అరెస్టుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు, నందికొట్కూరులో బీజేపీ నేతల అరెస్టులు

Updated on: Jan 06, 2021 | 12:04 PM

బీజేపీ-జనసేన నిన్న రామతీర్థం యాత్ర చేపట్టడం, సదరు ర్యాలీని అడ్డుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు, నేతల గృహనిర్భంధాలు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు పటేల్ కూడలిలో బీజేపీ పార్టీ నాయకులు, ఏపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరి రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో బైరెడ్డి శబరి రెడ్డిని తక్షణమే వెంటనే విడుదల చేయాలని నందికొట్కూరు పటేల్ సెంటర్ దగ్గర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా, నినాదాలు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us