ఆ ముగ్గురు ఔట్… కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన

Applications For The Selectors : టీమిండియా సెలెక్టర్ల కమిటీలో మూడు పోస్టుల నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెలెక్టర్ల కమిటీలోని ముగ్గురి పదవీకాలం పూర్తవ్వడంతో ఈ ప్రకటన జారీ చేసింది. వీరి ఎంపికకు కొన్ని అర్హతలను ప్రకటించింది. ఆ అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది. నిబంధనల ప్రకారం జాతీయ జట్టు సెలెక్టర్లు కావాలంటే టీమిండియా తరపున కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు లేదా 10 వన్డేలు లేదా 20 […]

ఆ ముగ్గురు ఔట్... కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన
Follow us

|

Updated on: Nov 11, 2020 | 12:22 AM

Applications For The Selectors : టీమిండియా సెలెక్టర్ల కమిటీలో మూడు పోస్టుల నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెలెక్టర్ల కమిటీలోని ముగ్గురి పదవీకాలం పూర్తవ్వడంతో ఈ ప్రకటన జారీ చేసింది. వీరి ఎంపికకు కొన్ని అర్హతలను ప్రకటించింది. ఆ అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది.

నిబంధనల ప్రకారం జాతీయ జట్టు సెలెక్టర్లు కావాలంటే టీమిండియా తరపున కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం రిటైర్​ అయ్యి ఉండాలి. 60 ఏళ్లు మించకూడదు అని ప్రకటనలో పేర్కొంది. నవంబరు 15 లోపు ఆశావహులు తమ దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియామకం అయ్యే ముగ్గురు కొత్త సెలెక్టర్లు సునీల్​ జోషీ నేతృత్వంలోని ప్యానెల్​లో భాగంగా ఉంటారు.

సెలెక్షన్​ కమిటీలోని సరన్​దీప్​ సింగ్​, దేవాంగ్​ గాంధీ, జతిన్ పరంజాపే పదవీకాలం ముగిసింది. సరన్​దీప్​, దేవాంగ్​, జతిన్​ ఈ ముగ్గురు ఆస్ట్రేలియా సిరీస్​కు భారత జట్టును ఎంపిక చేసినవారిలో ఉన్నారు. భారత్​, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్​లు జరగనున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా ఈ మ్యాచ్​లను ఆడనున్నారు.

ఈ ఛాంపియన్​షిప్​ పట్టికలో అగ్రస్థానంలో భారత్​ ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్​లో భారత్​ గెలుపొందింది.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?