స్వదేశీ జెర్సీతో మెరువనున్న ఆసీస్ జట్టు
భారత్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు రెడీ అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ జెర్సీలను ధరించనున్నారు.

Indigenous jersey : భారత్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు రెడీ అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ జెర్సీలను ధరించనున్నారు.
అయితే తొలిసారి ఈ జెర్సీని ధరించిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. స్వదేశీ జెర్సీని ధరించేందుకు తామెంతో ఉత్సుకతతో ఉన్నామని స్టార్క్ పేర్కొన్నాడు. ఈ కొత్త జెర్సీని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఆవిష్కరించింది. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి ఆసీస్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా స్వదేశీ జెర్సీలను తయారు చేశారు. అయితే ఈ జెర్సీపై ఉన్న పెయింటిగ్స్ చాలా సందేశాత్మకంగా ఉంది. అందుకు సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ వివరిస్తూ ఓ ట్వీట్ చేసింది.
Designed by Aunty Fiona Clarke & Courtney Hagen, our Aussie men’s Indigenous shirt pays tribute to the 1868 cricket team, who made a three-month journey from Australia to the UK by sea, playing 47 matches at some of the most famous grounds in world cricket! ??❤️ pic.twitter.com/5TGN0slCX7
— Cricket Australia (@CricketAus) November 11, 2020
భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబరు 27 నుంచి ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభం కానుంది. ముందుగా మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టులను ఆడనున్నారు. డిసెంబరు 4న టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.