సిడ్నీ వేదిక రసవత్తర పోరు… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌

|

Nov 27, 2020 | 9:32 AM

రసవత్తర పోరుకు సిడ్నీ వేదికగా మారుతోంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే ఫుల్ జోష్‌లో మొదలవుతున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్

సిడ్నీ వేదిక రసవత్తర పోరు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌
Follow us on

Australia vs India : రసవత్తర పోరుకు సిడ్నీ వేదికగా మారుతోంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే ఫుల్ జోష్‌లో మొదలవుతున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా‌ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతోంది.

మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి టెస్టు ఆడిన కోహ్లీసేన తర్వాత మరే జట్టుతోనూ క్రికెట్‌ ఆడకపోవడం తెలిసిన సంగతే. ఇక మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉన్నా అది కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్‌ తర్వాత యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఆడిన భారత ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి ఇప్పుడు కీలక పోరుకు సిద్ధమయ్యారు.

భారత జట్టు సభ్యులు : శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, నవదీప్‌ సైనీ‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు సభ్యులు : డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌మాక్స్‌వెల్‌, మార్నస్‌ లబుషేన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడం జంపా