సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకుంటున్న విద్యాసంస్థలు

|

Aug 18, 2020 | 10:41 PM

అసోం ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని అనుకుంటోంది.

సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకుంటున్న విద్యాసంస్థలు
Follow us on

అసోం ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు అనుగూణంగా ఉపాధ్యయులకు పలు సూచనలు చేసింది. అయితే ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రాష్ట్ర విద్యా, ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

మంత్రి బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ… పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ ఆగస్టు 21 నుంచి 30 మధ్య కరోనా పరీక్షలు చేయించుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. నెగిటివ్‌గా నిర్ధారణ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుంచి వారి పోస్టింగ్ స్థలానికి తప్పక హాజరు కావాలని, లేనివారికి జీతం ఇవ్వబడదని ఆయన తెలిపారు.

విద్యాసంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్‌ ను సిద్ధం చేసిందని, కేంద్ర నిర్ణయం  వచ్చిన వెంటనే ఇవి అమలులోకి వస్తాయని శర్మ అన్నారు. విద్యాసంస్థలు తిరిగి తెరిచిన తరువాత 5 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం ఆట స్థలం, పాఠశాల ప్రాంగణంతో సహా బహిరంగ ప్రదేశాల్లో తరగతులు, తదితర విషయాలను ఇప్పటికే షెడ్యూల్‌ చేసినట్లు మంత్రి వెల్లడించారు.