ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. విధుల్లోకి కండక్టర్లు..
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రౌండ్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా ఈ ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టింది.
APSRTC Break To RTC Ground Booking: కడప: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రౌండ్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా ఈ ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టింది. లాక్డౌన్ తర్వాత నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల ద్వారా సుమారు 350 సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. దాదాపు 1000కి పైగా ఉన్న కండక్టర్లను బస్టాండులలోని గ్రౌండ్ బుకింగ్ విధుల్లో ఉంచింది.
అయితే ఈ ప్రక్రియ కారణంగా కలెక్షన్ డల్గా ఉంటున్నాయి. అంతేకాకుండా బస్సులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. అందుకే గ్రౌండ్ బుకింగ్ విధానానికి స్వస్తి పలకాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీనితో గురువారం నుంచి కండక్టర్లు తిరిగి బస్సెక్కారు. బస్సుల్లోనే కండక్టర్లు విధులు నిర్వహించేలా ఆర్టీసీ ఆదేశించిందని ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జీవీ నరసయ్య వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారని స్పష్టం చేశారు.