కీసర ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్
కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మొదట మల్కాజ్గిరి తాసిల్దార్ గీతను ఇన్చార్జి తాసిల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.. గీత అనారోగ్యం కారణంగా కీసర తాసిల్దార్ గా రావడానికి ఆసక్తి చూపకపోవడంతో తాసిల్దార్ గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మళ్లీ రెండోసారి ఉత్తర్వులు జారీ చేశారు మేడ్చల్ జిల్లా కలెక్టర్. అయితే, ప్రస్తుతం గీత మల్కాజ్ గిరి ఎమ్మార్వోగా కొనసాగుతోంది. కీసర ఎమ్మార్వోకు ఈమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, కీసర ఎమ్మార్వోగా పని చేసిన నాగరాజు ఇటీవలే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆయన స్థానంలో గౌతమ్ కుమార్ నియమితులయ్యారు.