Flash: ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదల..

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

Flash: ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదల..

Updated on: Oct 27, 2020 | 5:29 PM

AP Grama Sachivalayam Exams: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. గత నెల 20వ తేదీ నుంచి 26  వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ రాత పరీక్షలు జరిగాయి. ఏపీ వ్యాప్తంగా దాదాపు 7,69,034 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌తో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ” సీఎం జగన్ గారి వినూత్న ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా అమలవుతున్న సంక్షేమ ఫలాలన్నీ లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుతున్నాయి. సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,048 ఖాళీలు ఉన్నాయి. మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us