ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !

డిగ్రీ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !
Follow us

|

Updated on: Oct 16, 2020 | 3:15 PM

డిగ్రీ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే ఇంటర్‌ పాసయితే చాలు.  ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, అటానమస్‌ డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీలో 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు కేటాయించనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా రిజర్వేషన్‌ విధానం అమలు కానుంది. ( చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..! )

చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారిని.. శ్రీ వెంకటేశ్వర, యోగి వేమన, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల పరిధిలో అడ్మిషన్స్‌కు స్థానికులుగా పరిగణిస్తారు. కృష్ణా,  గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిని ఆంధ్రా, కృష్ణా, ఆచార్య నాగార్జున, ఆదికవి నన్నయ, డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో అడ్మిషన్స్‌కు స్థానికులుగా పరిగణిస్తారు. మొత్తం సీట్లలో సూపర్‌ న్యూమరీగా 10% సీట్లను ఆర్థికంగా వెనకబడిన బలహీనవర్గాల కోటాగా కేటాయిస్తారు. ప్రతి కోర్సులోనూ మహిళల కోటా కింద 33.33% వర్తింపజేస్తారు. ఎన్‌సీసీ కోటాలో 1% సీట్లు కేటాయిస్తారు. ఇంటర్‌లో కామర్సు ఒక సబ్జెక్టుగా చదివిన వారికి రాష్ట్రస్థాయిలో బీకామ్‌లో 60% సీట్లు కేటాయిస్తారు. సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ చదివిన వారికి.. బీఏ కోర్సుల్లో 50% సీట్లు కేటాయిస్తారు. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )