YSR Health Clinics: పేద ప్రజల ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేస్తున్న ‘వైఎస్సార్ విలేజ్ క్లినిక్’లను ఏడాదిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిల్లో 80 శాతం కేంద్రాలకు సొంతంగా భవనాలు లేవు.
కొన్ని చోట్ల అయితే ఈ కేంద్రాలు చిన్న గుడిసెల్లో.. కూలిపోయే స్టేజిలో ఉన్న భవనాల్లో ఉన్నాయి. ఇక మీదట ఇలాంటి పరిస్థితి రాకూడదని ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం భవనాల్లో పూర్తి సదుపాయాల్లో ఈ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 పైగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే 8,890 కేంద్రాలు కొత్తగా నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికే 8,724 ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనులు మొదలైనట్లు అధికారులు స్పష్టం చేశారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్లతో పేదలకు ఎంతో మేలు…
Also Read:
విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..