‘ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తి మన ముఖ్యమంత్రి’

టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి జవహర్.. వైఎస్ జగన్ సర్కారుపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తీవ్రస్థాయిలో ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తి మన ముఖ్యమంత్రి' అంటూ జగన్ ను విమర్శించారు.

'ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తి మన ముఖ్యమంత్రి'
Follow us

|

Updated on: Sep 07, 2020 | 8:50 PM

టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి జవహర్.. వైఎస్ జగన్ సర్కారుపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తీవ్రస్థాయిలో ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తి మన ముఖ్యమంత్రి’ అంటూ జగన్ ను విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. జగన్ దెబ్బకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి కూడా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు హీరో, లులూ, కియా, అదాని వంటి పరిశ్రమలను ఎలా బెదిరించారో చూశామన్నారు. పెట్టుబడిదారుల సదస్సులు పెట్టకుండానే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్య, చంద్రులు కూడా తన వల్లే వస్తున్నారని భవిష్యత్తులో జగన్ చెప్పుకున్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. జగన్ కు పరభాషపై ఉన్న మోజు సొంత భాషపై లేదని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి స్థానం రావడానికి చంద్రబాబే కారణమన్న జవహర్.. చంద్రబాబు కృషిని తెలంగాణ మంత్రి కేటీఆర్ గుర్తించారని.. అదే విధంగా జగన్ కూడా గుర్తిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.