ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం, బాధ్యతలు స్వీకరించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి.. శనివారం వాటిని వెనక్కి తీసుకున్నారు. నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎస్ఈసీగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం 317 సర్క్యులర్లో ప్రకటించింది. నేడు ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి పేర్కొన్నారు.