AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ అందించింది. ఎంసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఏపీపీఈసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్  గడువును పొడిగించింది.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..
Ravi Kiran
|

Updated on: Sep 13, 2020 | 6:56 PM

Share

AP Eamcet Hall Tickets: ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ అందించింది. ఎంసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఏపీపీఈసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్  గడువును పొడిగించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఆయా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. ఎంసెట్‌కు ఈ నెల 15వ తేదీ వరకు, పీజీసెట్‌కు ఈ నెల 23 వరకు.. అలాగే లాసెట్‌, ఎడ్‌ సెట్‌, ఏపీపీఈసెట్ లేట్ ఫీజు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు అధికారులు పొడిగించారు.

కాగా, ఏపీలో ఈ నెల 17, 18,21,22,23 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్.. 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాగా, హాల్‌ టికెట్స్‌ కోసం విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ను సందర్శించాలని అధికారులు వెల్లడించారు.