మేడిగడ్డకు బయల్దేరిన సీఎం జగన్
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు ఆయన బయలుదేరారు. కాగా మరోవైపు ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ భూపాలపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన మేడిగడ్డ వద్దకు వెళ్లనున్నారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్న భోజన […]
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు ఆయన బయలుదేరారు. కాగా మరోవైపు ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ భూపాలపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన మేడిగడ్డ వద్దకు వెళ్లనున్నారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్న భోజన అనంతరం జగన్ తిరిగి అమరావతికి బయలుదేరుతారు.