తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన ముగిసిందో లేదో… ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న సీఎం.. సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీకానున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, పోలవరం నిధులు తదితర అంశాలపై అమిత్షాతో సీఎం చర్చించే అవకాశముంది. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి లేఖరాసిన ముఖ్యమంత్రి… ఈ నేపథ్యంలోనే అమిత్షాను కలవబోతున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసిన వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.