రిజర్వేషన్ల అమలుపై.. గవర్నర్ కు కన్నా లేఖ..

| Edited By:

Jun 18, 2020 | 5:22 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను

రిజర్వేషన్ల అమలుపై.. గవర్నర్ కు కన్నా లేఖ..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంపై మీరు జోక్యం చేసుకోవాలని కన్నా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం అందించిన 10% రిజర్వేషన్లను కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారంతా నష్టపోతున్నారని కన్నా అన్నారు. దేశంలోని ఉన్నత కులాల ప్రజలు ఆర్థికంగా బలహీనమైన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇదన్నారు.

అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదని, విద్యార్థులు ఉన్నత, వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశంతో పాటు ఉపాధికి అనేక అవకాశాలను కోల్పోతున్నారని కన్నా పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ విభాగాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసినా .. తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని కన్నా తెలిపారు. లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరినట్లు కన్నా లేఖలో పేర్కొన్నారు.